అల్ మదీనా కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ

4236చూసినవారు
మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని ధర్మాపూర్ నేషనల్ హైవే 167 అల్ మదీనా కళాశాల వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం నుంచి ఒక డీసీఎం లారీ రోడ్డు పక్కన ఆగి ఉంది. ఉదయం ముసురు వర్షం కురుస్తుండగా డీసీఎం లారీ కనబడక మరో రెండు లారీలు ఒకదాని వెంట ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లకు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్