టెన్నిస్ కోర్టును ప్రారంభించిన డీఐజీ

63చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన టెన్నిస్ కోర్టును మంగళవారం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కలిసి ప్రారంభించారు. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులకు క్రీడలు అవసరమన్నారు. ప్రతీ రోజు క్రీడలు ఆడటం వల్ల కొన్ని రోగాల బారిన పడకుండా జీవితాంతం ఆనందంగా జీవించొచ్చన్నారు. ప్రతి మనిషి జీవితంలో క్రీడలు భాగం కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్