ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డిఆర్డిఏ డీపీఎం

68చూసినవారు
ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డిఆర్డిఏ డీపీఎం
నాగర్ కర్నూలు మండలం శ్రీపురం గ్రామంలో ఐకెపి గ్రామ సమైక్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఏ డీపీఎం అరుణాదేవి గురువారం ప్రారంభించారు. వరి కొనుగోలు కేంద్రాన్ని గ్రామ పరిధిలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐకెపి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 104 కొనుగోలు కేంద్రాలకు గాను 40 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోలను ప్రారంభించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్