ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పని సరిగా పాటించాలి

77చూసినవారు
ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పని సరిగా పాటించాలి
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్లతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఎన్నికల పరిశీలకులు రుచేశ్ జైవన్షి, వ్యయ పరిశీలకులు సౌరబ్ అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఉదయకుమార్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి అభ్యర్థి వ్యయ వివరాలను నమోదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్