నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

53చూసినవారు
బిజినేపల్లి మండలం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి 9వ తరగతి, 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ గురువారం ప్రకటించారు. దరఖాస్తుదారులు ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష 8 ఫిబ్రవరి 2025 న జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్