గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా మారాయి. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన ఆయన నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో గత స్వేరోస్, బహుజనవాదులు, గత కేడర్ ప్రవీణ్కుమార్కు మద్దతు ఇవ్వడం లేదన్న టాక్ నడుస్తోంది. పలు సర్వేల్లో సైతం ఆర్ఎస్పీ వెనకంజలోనే ఉన్నారు. తాజాగా చేసిన ఓ సర్వేలో నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలుస్తారని తేలింది.