మంగళవారం ఉగాది కవి సమ్మేళనం: వనపట్ల సుబ్బయ్య

560చూసినవారు
మంగళవారం ఉగాది కవి సమ్మేళనం: వనపట్ల సుబ్బయ్య
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు, క్రోధినామ తెలుగు ఉగాది సంవత్సరం సందర్భంగా కవి సమ్మేళన నిర్వహిస్తున్నట్లు నెలపొడుపు సాహిత్య సంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వనపట్ల సుబ్బయ్య, వహీద్ ఖాన్ శనివారం తెలిపారు. సామాజిక అంశాలపై కవులు, కవయిత్రులు తమ కవితలు వినిపించాలని కోరారు. కార్యక్రమానికి సాహిత్య వ్యక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్