కాంగ్రెస్ పార్టీ నేతల ఇంటింటి ప్రచారం

57చూసినవారు
నారాయణపేట పట్టణంలోని అన్ని వార్డులలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటరును కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఒకటవ వార్డులో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సునీల్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బతుకమ్మ ఆడుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్