భారీగా బంగారం పట్టివేత

582చూసినవారు
భారీగా బంగారం పట్టివేత
నారాయణపేట పట్టణంలోని సెంటర్ చౌరస్తాలో గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బంగారు నగలు తయారీదారుడు రాజా వద్ద భారీగా బంగారు ఆభరణాలు పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. బంగారు దుకాణాలకు నగలు అందించేందుకు వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా తనిఖీలు నిర్వహించామని, అతని వద్ద ఎలాంటి పత్రాలు లేని 17 లక్షల రూపాయల విలువ గల 53. 09 తులాల బంగారు ఆభరణాలు పట్టుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్