కోయిలకొండ మండలం గార్లపాడు గ్రామంలో ముస్లిం మైనారిటీ సోదరులు ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు చల్ల వంశీచంద్ రెడ్డి, పిసిసి సభ్యులు చిట్టెం అభిజిత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ఇఫ్తార్ విందులో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తెలిపారు. పార్టీ నాయకులు హాజరు కావాలని కోరారు.