దశ దిశ లేని ప్రజా గర్జన సభ

53చూసినవారు
నారాయణపేట జూనియర్ కళాశాల గ్రౌండ్లో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రజా గర్జన సభ దశ, దిశ లేకుండానే జరిగిందని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజి ఎద్దేవా చేశారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యావంతుడైన చల్ల వంశీచంద్ రెడ్డి డీకే అరుణ ను దొరసాని అంటూ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్