ధన్వాడ మండల కేంద్రంలో రేపు అనగా గురువారం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరహరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ధన్వాడ, మరికల్ మండలాల ముఖ్య నాయకుల సమావేశం ఉంటుందని చెప్పారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి హాజరుకానున్నారని అన్నారు.