ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలి

85చూసినవారు
ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలి
ఎండలు తీవ్రరూపం దాల్చిందని ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ను అందించాలని ఎస్ఈ ప్రభాకర్ సిబ్బందికి సూచనలు చేశారు. గురువారం నారాయణపేట ఎస్ఈ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని విద్యుత్ సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. సిబ్బంది ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బందికి ఎండలకు వడ దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తగా ఓఆర్ఎస్ పాకెట్లను అందించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్