నారాయణపేట గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలో ఆదివారం అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ శ్రీహర్ష తో కలిసి ఓటింగ్ సరళిని పరిశీలించారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ. పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఉద్యోగి ఓటును వినియోగించుకోవాలని కోరారు. సంబందిత అధికారులు పాల్గొన్నారు.