ఆకట్టుకున్న కేరళ కళాకారుల బృందం ప్రదర్శన

70చూసినవారు
వనపర్తి జిల్లా చిట్యాలలో శివుని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా బుధవారం రాత్రి శివుడు తదితర దేవతామూర్తుల విగ్రహాలను వీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ఊరేగింపు అగ్రభాగంలో కేరళ కళాకారుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన కోలాట, భజన బృందాల ప్రదర్శన దానికి తోడవడం రక్తి కట్టించింది. ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. దేవతల జలాధివాసం సందర్భంగా ఊరేగింపు జరిగిందని మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్