వనపర్తి జిల్లా & మండలం రాజపేట - నాగవరం తండా మధ్య బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న రవీందర్, వెంకటయ్య అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు వనపర్తి నుంచి కొత్తకోటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహలను వనపర్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.