తప్పుడు పత్రాలతో భూమి విక్రయించిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ శ్రీహరి శనివారం తెలిపారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం(యం) కమాలొద్దీన్పూర్ శివారులో రజియా సుల్తానాకు ఐదెకరాల వ్యవసాయ భూమిని ఆమెకు తెలియకుండా గద్వాలకు చెందిన మౌలానా, షమీ, అజీజ్ అహ్మద్, హైదరాబాద్ కు చెందిన అక్సర్ అలీఖాన్, షఫీ తప్పుడు పత్రాలు సృష్టించి. 2023 అక్టోబర్ 2న అదే గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డికి విక్రయించారు.