హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: పురుషోత్తం రెడ్డి

80చూసినవారు
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, బీజేపీకి ఓటు వేసి బుద్ధి చెప్పాలని రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత పురుషోత్తం రెడ్డి కోరారు. శనివారం వనపర్తి మండలం అప్పాయిపల్లిలో ఇంటింటి ప్రచారం అనంతరం, ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ. 2 లక్షల రుణమాఫీ, ధాన్యానికి రూ. 500 బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రైతుబంధు హామీలు అమలు కాలేదన్నారు. బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ కు ఓటేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్