విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలలో భాగంగా హోమం, పూజలు

556చూసినవారు
వనపర్తి జిల్లా చిట్యాల శివాలయం ఆవరణలో బుధవారం వేద పండితులు శాస్త్రోక్తంగా హోమం, పూజలు నిర్వహించారు. శివుని విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలలో భాగంగా ఆవాహిత దేవత పూజలు, వేద పారాయణం, మూల మంత్ర జపం నిర్వహించారు. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు వెంకట్ రావు, భాను ప్రకాష్, రామచంద్రయ్య, ఆలయ కమిటీ సభ్యులు రాములు, పాండురావు, గ్రామ పెద్దలు పూజలు చేశారు. శివనామ స్మరణతో ఊరు మార్మోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్