వనపర్తి జిల్లా & మండలం చిట్యాలలో సుమారు రూ. 2 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన శివాలయంలో ఏప్రిల్ 2, 3, 4న శివుని విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానాలు అందజేశారు. ఇప్పటికే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డికి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డికి ఆహ్వాన పత్రికలను అందజేసిన వారు గురువారం ఎంపీ రాములుకు ఆహ్వాన పత్రిక అందజేశారు.