సోమవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి ని గెలిపించాలని కోరుతూ గత 11 రోజులుగా వనపర్తి పట్టణంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తో పాటు డాక్టర్ పగిడాల శ్రీనివాస్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా సోమవారం పట్టణంలోని నడింగేరిలో, కమాన్ చౌరస్తా లో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం చేపట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థి మల్లురవి ని గెలిపించాలని అభ్యర్థించారు.