జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామంలోని పునరావాస గృహాల వద్ద నివాసం ఉండే పేతూరు, కృష్ణ అనే వ్యక్తులు ఒక చోట గడ్డివాములను ఇటీవలే కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకున్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం వేళ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగి, పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు రూ. 2 లక్షల మేర నష్టం వాటిళ్లిందని బాధితులు వాపోయారు.