250 మీటర్ల ఎత్తు నుంచి పడి వ్యక్తి మృతి (షాకింగ్ వీడియో)

65చూసినవారు
హిమాచల్‌లో శ్రీఖండ్ మహాదేవ్ యాత్రలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కులు జిల్లాలోని నిర్మండ్ సబ్ డివిజన్‌లోని శ్రీఖండ్ మహాదేవ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక భక్తుడు మంచు మీద జారిపడి మృతి చెందాడు. అతను కనీసం 200-250 మీటర్ల మేర మంచులో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడిని బులంద్‌షహర్ జిల్లా గులాటి గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్ వర్మ కుమారుడు వినయ్ వర్మ (50)గా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్