అడ్మిషన్లు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

68చూసినవారు
రాష్ట్రంలో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలపైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాలలో జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ఫలితాలు రాకముందే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభించారని తెలిపారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్