భారత్లోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన చాకొలేట్ మాన్యుఫ్యాక్చరర్ లోటస్ చాకొలేట్ కంపెనీ స్టాక్స్ దూసుకుపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజులోనే ఈ షేరు దాదాపు 12 శాతం పెరిగింది. మంగళవారం సెషన్ ముగిసే సరికి లోటస్ షేరు ధర 11.59 శాతం పుంజుకొని రూ.450 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది ఏకంగా 16 శాతం వరకు లాభంతో రూ.470 వద్ద సెషన్ గరిష్టాన్ని, 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది.