రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్ డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో సీపీ ఎం. శ్రీనివాస్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న వివిధ కేసులపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పరిశోధనతో సమగ్ర విచారణ చేపట్టి నేరాల నియంత్రణ చేసి చట్టపరంగా సమగ్ర సాక్ష్యాధారాలతో నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.