మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రస్తుతం OTTలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్లోకి వచ్చేస్తోంది. ప్రముఖ TV ఛానెల్ జెమినీ టీవీలో ఏప్రిల్ 7వ తేదీన సాయంత్రం 6 గంటలకు గుంటూరు కారం మూవీ టెలికాస్ట్ కాబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు.