వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు.. జన్నారం ఎస్సై

64చూసినవారు
వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు.. జన్నారం ఎస్సై
జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని స్థానిక ఎస్సై రాజవర్ధన్ తెలిపారు. జన్నారం పట్టణంలోని మేదరి వాడలో ఏర్పాటుచేసిన గణనాథుని దర్శించుకుని పూజలు చేశారు. జన్నారం పట్టణంలోని అన్ని గ్రామాలలో సోమవారం రాత్రి జరిగే వినాయక విగ్రహాల నిమజ్జనానికి పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్