మందమర్రి: గాంధారి మైసమ్మ అమ్మవారికి వెండి ఆభరణాల తొడుగులు అందజేత

76చూసినవారు
మందమర్రి: గాంధారి మైసమ్మ అమ్మవారికి వెండి ఆభరణాల తొడుగులు అందజేత
మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారి మైసమ్మ అమ్మవారికి భక్తులు సుమారు 3. 1/4 కిలోల వెండి ఆభరణాల తొడుగులు అందజేశారు. అందుగులపేటలోని శ్రీ వాసవి రైస్ మిల్ నిర్వాహకులు చిలువేరు శ్రీనివాస్, రవీందర్, మహేష్, మణికాంత్, ప్రవీణ్, కౌటారపు నరేందర్ సోమవారం వెండి తొడుగులు అందించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్