మార్వాడీ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర

74చూసినవారు
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడీ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర ముఖ్య కూడళ్ల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో మార్వాడీ ప్రగతి సమాజ్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ బల్ద్వా, కార్యదర్శి ప్రేమ్ రాజ్ అగర్వాల్, కోశాధికారి ఓం ప్రకాష్ తివారి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్