మంచిర్యాల మున్సిపాలిటీ 5వ వార్డు పరిధిలోని సాయికుంటకు చెందిన నిరుపేద యువతి వివాహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదమల్ల అశోక్ తేజ చేయూత అందించారు. ఆవునూరి మధునమ్మ మధునయ్య దంపతుల కూతురు జీవన వివాహ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టకాలంలో తమకు సహాయం అందించిన అశోక్ తేజకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.