చికిత్స పొందుతూ కార్మికుడు మృతి..!
మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజకవర్గం, మందమర్రి సింగరేణి కాసిపేట 3 గనిలో రాజు (40) సం.రాలు అనే కార్మికుడు జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సింగరేణి ఏరియా స్టోర్ కు వెళ్ళాడు. పని చేస్తున్న క్రమంలో క్రేన్ వాహనంతో ఇనుప రేకులు లోడ్ చేస్తుండగా రేకులకు కట్టిన బెల్టు తెగి రాజు పై రేకులు పడ్డాయి. సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించగ, హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.