హత్రాస్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 122 మంది మరణించారు. దాదాపు మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో కేంద్ర బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.