ఇకపై దిగ్గజాలు లేని మ్యాచ్‌లు

69చూసినవారు
ఇకపై దిగ్గజాలు లేని మ్యాచ్‌లు
భారత క్రికెట్ ఫ్యాన్స్ ఇకపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని టీ20 మ్యాచ్‌లు చూడాలి. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ అనూహ్యంగా ఓపెనర్లుగా దిగారు. ఒకరు ఔటైనా మరొకరు జట్టును ముందుకు నడిపించి, విజయాల్లో కీలకపాత్ర పోషించారు. కప్ గెలిచిన తర్వాత ఈ దిగ్గజాలిద్దరూ కొత్త ఆటగాళ్లకు స్వాగతం పలుకుతూ పొట్టి ఫార్మాట్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇకమీదట టీ20ల్లో రోహిత్, కోహ్లీ వారసులుగా ఎవరు ఎదుగుతారనేది వేచిచూడాలి.

సంబంధిత పోస్ట్