AP: తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మే నెల కోటాను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఫిబ్రవరి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేయనుంది.