చిలిప్ చేడ్ మండలం - Chilipched Mandal

మెదక్ జిల్లా
మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి నీలం మధు
Apr 29, 2024, 06:04 IST/

మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి నీలం మధు

Apr 29, 2024, 06:04 IST
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు సోమవారం సంగారెడ్డిలో మార్నింగ్ వాక్ చేశారు. షటిల్, క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. యోగా నిర్వాహకులతో కలిసి కాసేపు యోగా చేశారు. వాకింగ్ ట్రాక్ లు, ఇండోర్ ప్లేగ్రౌండ్స్ అవసరం చాలా ఉందని నీలం మధుకు వారంతా ఎంపీ అభ్యర్థి నీలం మధుకు విన్నవించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే సంగారెడ్డి ప్రాంతం అభివృద్ధి జరిగిందని తనను కలిసిన వాకర్లు చెబుతున్నారని నీలం మధు తెలిపారు. వాస్తవానికి దేశం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ హయాంలోనే బీడీఎల్ బీహెచ్ఎల్ ఇక్రిసాట్ వంటి గవర్నమెంట్ సెక్టార్లన్నీ మెదక్ జిల్లాలో నెలకొల్పడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ విప్ గా ఉన్న జగ్గారెడ్డి స్థానికంగా ఐఐటి తీసుకురావడమే కాకుండా కలెక్టరేట్ బ్యాక్ సైడ్ గ్రౌండ్ కోసం కృషి చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పాటుపడుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, రాహుల్ గాంధీ నేతృత్వంలో పాంచ్ గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. యువత ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.