హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న రాథోడ్ దీప్తి అగ్రికల్చర్ విద్యార్థిని గురువారం రాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉంటుందని తన స్నేహితులు తెలిపారు. మృతురాలిది నిజామాబాద్ జిల్లా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచరణ చేపట్టి మృతదేహనికి వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.