మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలో పల్లె నిద్రలో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ. మంగళవారం ఉదయం గ్రామంలో గడపగడపకు తిరుగుతూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు చదువుపై అవగాహన కల్పిస్తామన్నారు. బడిలో పిల్లలను చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.