మేడిగడ్డ బరాజ్ సేఫ్ అని, నిపుణులు తేల్చి చెప్పారని ట్విట్టర్(X) వేదికగా BRS పోస్ట్ చేసింది. మేడిగడ్డ బరాజ్లోని ఒక్క ఏడవ బ్లాక్లో చిన్న మరమ్మత్తులు చేసి, బరాజ్ని యధావిధిగా వాడొచ్చునని స్పష్టం చేసిందని వెల్లడించింది. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరంపై అనవసర రాద్ధాంతం చేసిన సీఎం రేవంత్రెడ్డి, ఇతర నాయకుల చెంప చెల్లుమనిపించేలా నిపుణుల బృందం రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించింది.