ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో 15 ఏళ్ల బాలుడు 50 ఏళ్ల వ్యక్తిని పదునైన కత్తితో గొంతుకోసి హతమార్చాడు. తరచూ తనను బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడుతుంటడంతోనే తాను హత్యకు పూనుకోవాల్సి వచ్చిందని పోలీసులు విచారణలో బాలుడు వెల్లడించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.