స్కైప్ సర్వీసులకు గుడ్బై చెప్పేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైంది. మే నుంచి ఈ సేవలను శాశ్వతంగా నిలిపివేయనుందని ఎక్స్డీఏ తన నివేదికలో వెల్లడించింది. స్కైప్ తన సేవల్ని 2003లో తొలుత ప్రారంభించింది. 2011లో మైక్రోసాఫ్ట్ ఈ సర్వీసుల్ని కొనుగోలు చేసింది. అలా 22 ఏళ్ల పాటు స్కైప్ తన సేవల్ని అందిస్తూ వచ్చింది. 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ను లాంచ్ చేసినప్పటి నుంచి స్కైప్ అంతర్గతంగా పోటీ ఎదుర్కొంటోంది.