TG: శాసనసభ నడిపే తీరును నిరసిస్తూ ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఇది గాంధీభవన్ కాదు.. తెలంగాణ శాసనసభ, అసెంబ్లీని గాంధీ భవన్లా నడపొద్దు అని అన్నారు. ప్రభుత్వం అసెంబ్లీ నిర్వహణలో విఫలమైందని అక్బరుద్దీన్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని శాసనసభలో ఖూనీ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.