రైతులకు మంత్రి కోమటిరెడ్డి గుడ్ న్యూస్

75చూసినవారు
రైతులకు మంత్రి కోమటిరెడ్డి గుడ్ న్యూస్
తెలంగాణలో గత 4 రోజులుగా కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగళ్ల వానకు పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుంటే రైస్ మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్