నిమిషం లేటు.. గ్రూప్-1 పరీక్షకు నో ఎంట్రీ

69చూసినవారు
ఇవాల్టి గ్రూప్ 1 పరీక్షకు నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. పలు చోట్ల చివరి నిమిషం దాటాక అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. రూల్ ప్రకారం 10 గంటలకు ఒక్క నిమిషం లేటయినా అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో వారంతా ఉసూరుమంటూ వెనుదిరిగారు. కాగా 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. 4.03 లక్షల మంది పరీక్షకు అప్లై చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్