ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. తీహార్ జైలులో ఉన్న కవిత కస్టడీ నేటితో ముగిసింది. దీంతో కవితను కోర్టులో హాజరుపర్చగా కస్టడీని మరో వారం రోజులు పెంచుతూ కోర్టు తీర్పిచ్చింది. దీంతో కవిత ఈనెల 14 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు.