మే 13వ తేదీన జరగనున్న ఏపీ పోలింగ్లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలను కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా కూటమి ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు.