తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసింది కాంగ్రెస్ పార్టీనే అని దుయ్యబట్టారు.