మే 13న వారణాసిలో మోదీ నామినేషన్

51చూసినవారు
మే 13న వారణాసిలో మోదీ నామినేషన్
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బీజేపీ తరపున వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 13న ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్లు యూపీ బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ర్యాలీకి ముందు ఆయన కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకోనున్నట్లు సమాచారం. అనంతరం వారణాసిలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్