జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన అనుభవాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో జొమాటో ప్రారంభ రోజుల నాటి అనుభవాలను గోయల్ వివరించారు. దీనిపై మోదీ స్పందిస్తూ ‘‘నేటి భారతంలో ఇంటి పేరుతో పట్టింపు లేదు. శ్రమించడమే ఇక్కడ ముఖ్యం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మీ ప్రయాణం ఒక ప్రేరణ, స్ఫూర్తిదాయకం. స్టార్టప్ల కోసం అనుకూల వాతావరణాన్ని అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని హామీ ఇచ్చారు.