ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో తెలుగు సినీ నిర్మాతల సమావేశమయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీరంగం అభివృద్ధి అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. పవన్ను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, డి.సురేశ్ బాబు, దిల్ రాజు తదితరులు ఉన్నారు.